మద్యం మత్తులో తమ్ముడ్ని నరికి చంపిండు

మద్యం మత్తులో తమ్ముడ్ని నరికి చంపిండు

నర్సింహులపేట(దంతలపల్లి), వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలో మద్యం మత్తులో తోడబుట్టిన తమ్ముడినే నరికి చంపాడో అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతలపల్లి మండలం రెపోని గ్రామానికి చెందిన వీరబోయిన వెంకన్న, గంగయ్య, గణేశ్, శ్రీను అన్నదమ్ములు. వారిలో శ్రీను సూర్యాపేటలో ఉంటుండగా మిగిలిన ముగ్గురూ గ్రామంలోనే కూలి పనులకు వెళ్తుంటారు. వెంకన్నకు పెండ్లి కాగా భార్య అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గంగయ్య(35)కు పెళ్లి కాకపోవడంతో రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి తాగొచ్చి మరోసారి గొడవ పడగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకన్న గొడ్డలితో తమ్ముడు గంగయ్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో గంగయ్య స్పాట్​లోనే చనిపోయాడు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ సాగర్, ఎస్సై మురళీధర్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.