సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా వివిధ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల నియోజకవర్గంలో జరగనున్న జన జాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సాయంత్రం 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 8. 30 గంటలకు శేర్ లింగంపల్లిలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రచారం చేస్తారు.