ఇయ్యాల మూడు నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచారం

ఇయ్యాల మూడు నియోజకవర్గాల్లో  సీఎం ఎన్నికల ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా వివిధ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల నియోజకవర్గంలో జరగనున్న జన జాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 8. 30 గంటలకు శేర్ లింగంపల్లిలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రచారం చేస్తారు.