23న బార్లు, వైన్స్ బంద్ : హైదరాబాద్ సీపీ

23న బార్లు, వైన్స్ బంద్ : హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు హైదరాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లుచేశామన్నారు సీపీ అంజనీకుమార్. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించనున్నట్టు చెప్పారు. ఈ నెల 23న ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు సీపీ. సిటీలో బార్లు, వైన్స్ షాపులు మూసి ఉంచాలని ఆదేశించామన్నారు.