మార్చి9 లేదా 11న ఎన్నికల ప్రకటన?

మార్చి9 లేదా 11న ఎన్నికల ప్రకటన?

దేశ వ్యాప్తంగా ఎన్నికల శంఖారావం త్వరలో మోగనుంది. మార్చి 9 లేదా 11న ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్రం ఎన్నికల కోసం నిధులు కూడా కేటాయించింది. దీంతో నిర్వహణకు మార్గం మరింత సుగమమైంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది విడుతలుగా ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.