ఎన్నిక రోజే TS–SET పరీక్ష..మార్పులు ఉంటయా..? 

ఎన్నిక రోజే TS–SET పరీక్ష..మార్పులు ఉంటయా..? 

రాష్ట్రంలో మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మార్చి 13న జరుగుతున్నట్టు ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఇదే రోజు జరుగనున్న TS–SET పరీక్షకు కొంత మంది ఉపాధ్యాయులు హాజరు కానున్నారు. చాల మంది అధ్యాపకులు వివిధ దూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరై వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ వేయాలంటే ఇబ్బందికరంగా మరే అవకాశం ఉంది. ఒక వేళ ఓటు వేసి పరీక్షకు వెళ్ళాలన్న దూరప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళడం కష్టంగా మారుతుంది.

ఈ క్రమంలో TS–SET పరీక్ష అభ్యర్థుల ఇబ్బంది దృష్ట్యా 13వ తేదిన జరుగుతున్న పరీక్షను మరొక తేదికి మార్చాలని ఎమ్మెల్సీ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు తేది మార్పుపై సెట్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని సంతోష్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని TS–SET పరీక్ష మార్చి 13,14,15 తేదిలో ఉంటుంది అని గతంలో ఓయూ షెడ్యూల్ విడుదలచేసింది.