
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్ టీపీసీ తెలంగాణ ప్లాంట్ లోని 800 మెగా వాట్ల రెండో యూనిట్లో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కోల్ ఫైర్ చేసి సింక్రనైజేషన్ కు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేశారు. రెండు నెలల కింద పెట్రోల్ ద్వారా సింక్రనైజేషన్ చేసి పరీక్షించారు. టెక్నికల్సమస్యలను అధిగమించి బుధవారం అర్ధరాత్రి కోల్ ఫైర్ చేసి విద్యుత్ఉత్పత్తి ప్రారంభించారు.
ఈ యూనిట్ను దక్షిణాది గ్రిడ్ కు అనుసంధానం చేశారు. విభజన చట్టంలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలి. మొదటి ఫేజ్లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 800 మెగావాట్ల మొదటి యూనిట్ను 3 నెలల కింద ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. మరో 2,400 మెగావాట్ల ఉత్పత్తికి సంబంధించి మూడు యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాల్సి ఉంది.