ఉద్యోగుల వివరాలు త్వరగా ఆన్ లైన్ చేయాలి

ఉద్యోగుల వివరాలు త్వరగా ఆన్ లైన్ చేయాలి

పోలీస్ శాఖలో ఉద్యోగుల వివరాలు, సర్వీస్ రికార్డుల ఆన్ లైన్ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. గురువారం అన్ని జిల్లాల్లో ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఆన్ లైన్ ప్రక్రియను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల వివరాలు ఎక్కడి నుండైనా పొందేలా చేపట్టిన ఆన్ లైన్ రికార్డుల నమోదు ప్రక్రియను తప్పులు దొర్లకుండా చూడాలన్నారు.

అనుకున్న సమయానికి పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రికార్డుల ఆన్ లైన్ నమోదు త్వరగా పూర్తి చేయడం ద్వారా మరింత సౌకర్యవంతంగా ఉద్యోగులకు సేవలందించవచ్చన్నారు. దీని ద్వారా బదిలీలు జరిగినప్పుడు, పదవీ విరమణ సమయాలలో అన్ని వివరాలు ఒకే చోట పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.