- వైద్యారోగ్య శాఖ కమిషనరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
బషీర్బాగ్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్ అండ్ స్కీమ్(ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు కోఠిలోని వైద్యారోగ్యశాఖ కమిషనరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్ఖన్నా మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం కింద 15 వేల మంది
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని.. వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్న డాక్టర్లను ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేశారో అదే విధంగా మిగతా సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.