కేసీఆర్​కు ఉద్యోగుల సంఘం లేఖ

కేసీఆర్​కు ఉద్యోగుల సంఘం లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు 1,808 మంది ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని, వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని కేసీఆర్​కు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీంద్రకుమార్, హరీశ్​ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎంకు సోమవారం వారు లేఖ రాశారు. పిల్లల చదువులు, స్పౌజ్, హెల్త్ వంటి కారణాలను చూపుతూ1,808 మంది ఉద్యోగులు తెలంగాణ వచ్చేందుకు ఎన్ వో సీ ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరారని తెలిపారు. తెలంగాణలో ఏపీకి చెందిన ఉద్యో గులు1,369 మంది ఉంటే ఏపీ నుంచి తెలంగాణకు1,808 మంది వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.