జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్నఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్నఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ లో భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో బలగాలు…కార్డన్ సెర్చ్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వీరిని నిలువరించేందుకు నిన్న(సోమవారం) రాత్రంతా ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల వేట కోసం మరిన్ని బలగాలు స్పాట్ కు చేరుకున్నాయి. త్రాల్ లోని మిర్ ప్రాంతంలో… హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. మరోవైపు త్రాల్ లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.