గేట్​తో ఐఐటీల్లో ఎంటెక్

గేట్​తో ఐఐటీల్లో ఎంటెక్

దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌‌‌‌‌‌‌‌ కోర్సుల్లో అడ్మిషన్స్​కు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ (గేట్‌‌‌‌‌‌‌‌)-2024 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదలైంది. ఐఐటీలు, నిట్‌‌‌‌‌‌‌‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ కోర్సులు చేయడానికి గేట్‌‌‌‌‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి.అర్హతలు: ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌, సైన్స్‌‌‌‌‌‌‌‌, హ్యుమానిటీస్‌‌‌‌‌‌‌‌లో బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి లేదు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: అభ్యర్థులను కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ ఛాయిస్‌‌‌‌‌‌‌‌  ప్రశ్నలు, మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నలు, న్యూమరికల్‌‌‌‌‌‌‌‌ ఆన్సర్‌‌‌‌‌‌‌‌ టైప్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్‌‌‌‌‌‌‌‌ మార్కింగ్‌‌‌‌‌‌‌‌ విధానం ఉంటుంది.

దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 16న విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.gate2024.iisc.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.