హాస్టల్‌లో ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్‌లో ఉరేసుకుని  బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మైసమ్మగూడలో  ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  జనగామ జిల్లా లింగాల గణపురం ప్రాంతానికి చెందిన కొయేటి మాధవి(20) మిసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అక్కడే ఉన్న మహాలక్ష్మి ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే మాధవి తండ్రి నెల క్రితం చనిపోగా అప్పటి నుండి ఇంటి వద్దే ఉంటుంది. రెండు రోజుల క్రితం హాస్టల్ కు వచ్చింది. శుక్రవారం సాయంత్రం సమయంలో తన రూం మెంట్స్ బయటకు వెళ్లగా రూమ్ లో  తీవ్ర మనస్తాపానికి లోనై ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  తోటి స్నేహితులు తిరిగి వచ్చి చూసే సరికి ఫ్యాన్ కు చున్నీ తో వేలాడుతూ కన్పించింది.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.