IND vs ENG 4th Test: గింగరాలు తిరుగుతున్న బంతి.. రసవత్తరంగా రాంచీ టెస్ట్

IND vs ENG 4th Test: గింగరాలు తిరుగుతున్న బంతి.. రసవత్తరంగా రాంచీ టెస్ట్

రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ పోరాడుతుంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. దీంతో రాంచీ టెస్టు రసవత్తరంగా మారింది. లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (18) జడేజా (3) ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే మరో 74 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. 

నాలుగో రోజు పిచ్ గింగరాలు తిరుగుతుండటంతో ఈ మ్యాచ్ లో భారత్ జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధించే అవకాశం ఉంది. వికెట్లేమీ కోల్పోకుండా 40 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు రోహిత్, జైస్వాల్ తొలి వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని  నెలకొల్పారు. అయితే ఈ దశలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు విజ్రంభించడంతో 84/0 తో ఉన్న భారత్ 100/3 తో నిలిచింది. 37 పరుగులు చేసిన జైశ్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి కుదురుకున్నాడనుకున్న రోహిత్(55), పటిదార్(0) వెంట వెంటనే ఔటయ్యారు.
 
దీంతో మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుమానం కలిగించారు. ఏ దశలో జడేజా, గిల్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా సెషన్ ను ముగించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హార్టిలి, రూట్, బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.