
వికాస్ ముప్పాల,గాయత్రి గుప్తా,సాజ్వి పసల,సంతోష్ నందివాడ,కిషోర్ ప్రధాన పాత్రల్లో భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్ సేపురు,తరుణ్ విఘ్నేశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్'(Plot). ఈ మూవీ కర్నూలులోని ఎమ్మిగనూర్ బ్లాక్డ్రాప్లో సాగుతుంది.గతేడాది నవంబర్లో థియేటర్లలో రిలీజైన ఈ సైకలాజికల్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయింది.దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ ప్లాట్ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్కు రాబోతుంది.జూలై 11న ప్లాట్ మూవీని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ అధికారికంగా వెల్లడించింది.డైరెక్టర్ భాను భవ డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు.పాత్రల మధ్య కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది.సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కు ప్లాట్ బాగా నచ్చుతుంది.
So, What's the plot for this time is the "PLOT" ?
— ETV Win (@etvwin) July 9, 2024
PREMIERES July 11#EtvWin #WinThoWinodam pic.twitter.com/9ProTeg07v
కథేంటంటే:
రాహుల్ (ఫెయిల్డ్ బిజినెస్మ్యాన్),తన గర్ల్ ఫ్రెండ్ దీపు (డ్రగ్ డీలర్) ఇద్దరూ ఎమ్మిగనూరులో తలదాచుకుంటారు.ఇక హైదరాబాద్లో దీపు ఓ వ్యక్తిని హత్య చేస్తుంది.దీంతో ఆ చనిపోయిన వ్యక్తి సోదరుడు సమీర్..దీపును వెతుకుతూ ఉంటాడు.తన ఇంటికి అమ్మేసి దీపుతో కలిసి విదేశాలకు వెళ్లిపోవాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు.ఆ ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకొని తాను ఆ బిజినెస్లోకి దిగుతాడు. చాలా తక్కువ కాలంలోనే సక్సెస్ కూడా అవుతాడు.ఇంతలో దీపు కోసం వెతుకుతున్న సమీర్ వీళ్లని ట్రాక్ చేసి పట్టుకుంటాడు.దీంతో సమీర్ను చంపేసి తాను అమ్ముతున్న ప్లాట్ లోనే పాతిపెట్టేస్తారు రాహుల్-దీపు.ఇక అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న టైమ్లో ఒక అజ్ఞాత వ్యక్తి రాహుల్కి ఫోన్ చేసి తన బిజినెస్ను ఆపాలంటూ బెదిరిస్తాడు.ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? గతంతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి?రాహుల్ ఈ సమస్య నుంచి బయటపడ్డాడా?అనేదే ప్లాట్ సినిమా కథగా ఉంది.