బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాపోలు

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాపోలు

కాంగ్రెస్ ను 25 ఏళ్ల ప్రస్థానం తర్వాత వీడానన్నారు రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్‌. 15 రోజుల అంతర్మథనం తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం లాంటివి ఏమీ లేని కాంగ్రెస్ లో ఉండలేకపోయానన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ కోసం, దేశ సమగ్రత కోసం బీజేపీలో చేరానన్న రాపోలు… రాష్ట్ర అభివృద్ధి, చేనేత కార్మికుల కోసం కృషి చేస్తానన్నారు.  బీజేపీతోనే ఇవ్వన్నీ సాధ్యమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు తెలుపుతూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపారు రాపోలు ఆనంద్ భాస్కర్. తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జేపి నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు.