పోలీస్, మిలటరీ ఆఫీసర్ నంటూ బెదిరింపులు, కిడ్నాప్ లు

పోలీస్, మిలటరీ ఆఫీసర్ నంటూ బెదిరింపులు, కిడ్నాప్ లు

హైదరాబాద్ : ఫేక్ పోలీస్, మిలటరీ ఆఫీసర్ నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెదిరింపులు, కిడ్నాప్ కు పాల్పడిన కార్తిక్ సింగ్ ను అరెస్టు చేసినట్లుయ తెలిపారు కేపీహెచ్ బీ పోలీసులు. గతంలోనూ కార్తిక్ సింగ్ నకిలీ కల్నల్ గా అరెస్టయ్యాడన్నారు. జైలు నుండి విడుదలయ్యాక దీపక్ కుమార్ బోరా, గడ్డం అనిల్ కుమార్, పైలా స్వామి సత్యనారాయణ, కేళ్ళ శ్రీనుల సాయంతో.. పోలీసులమని నమ్మించి, తమ్మిరెడ్డి దిలీప్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు కార్తీక్ సింగ్. తమ్మిరెడ్డి దిలీప్ ను జంగారెడ్డిగూడెంలో బంధించి, యాభై వేల రూపాయల నగదు, హోండా సిటీ కారును లాక్కున్నారు నిందితులు. అయితే జంగారెడ్డిగూడెం నుండి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు తమ్మిరెడ్డి దిలీప్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కార్తీక్ సింగ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.