హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కు క్రికెట్ ఫ్యాన్స్క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఐపీఎల్మ్యాచ్ తరహాలో స్టేడియం కిక్కిరిసిపోయంది. కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగడంతో ఈలలు, కేకలతో దద్దరిల్లింది. కరీంనగర్ డైమండ్స్ 209 రన్స్చేయగా, వరంగల్ వారియర్స్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
