వరంగల్ లో రైతు ఆత్మహత్య

వరంగల్ లో రైతు ఆత్మహత్య

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామంలో విషాదం నెలకుంది. జయరాం తండాకు చెందిన గుగులోతు లక్ష్మ అనే రైతు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయానికి పెట్టుబడి లేక అప్పుల పాలయ్యామని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పంట ఆశించినంత దిగుబడి రాకపోవడంతో 4లక్షల అప్పయిందని..దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అంతే కాకుండా వారసత్వంగా వచ్చిన భూమిని రెవన్యూ అధికారులు వేరేవారి పేరుమీద రిజిస్టర్ చేశారని అన్నారు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

For More News..

ప్రపంచంలోని గొప్ప నేతల్లో వాజ్​పేయి ఒకరు

కేటీఆర్ ఆయన తెలంగాణకు వస్తే తరిమి కొడతాం: రాజాసింగ్