ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు వాజ్​పేయి

ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు వాజ్​పేయి

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్​పేయి జయంతి ఉత్సవాలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి,  లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి జయంతిని పండుగలా నిర్వహించుకుంటూ.. వారి జ్ఝాపకాలను నెమరవేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 

‘నేటి తరానికి, భావి తరాలకు వాజ్ పేయి చరిత్రను వివరించాల్సిన అవసరం ఉంది. వాజ్ పేయి చాలా అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు.  వాజ్ పేయి హయాంలో అనేక అద్బుత కార్యక్రమాలు నిర్వహించారు. వాజ్ పేయి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వ్యక్తిగతంగా సేవ చేసే అవకాశం నాకు దక్కింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రోక్రాన్ అణు పరీక్షలు, పొదుపు సంఘాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం, ఎవరూ ఊహించని విధంగా జాతీయ రహదారుల నిర్మాణం వంటి అద్భుత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు.     కార్గిల్ యుద్దంలో వాజ్ పేయి పోషించిన పాత్ర మరువలేనిది. వైరుధ్యమున్న 24 పార్టీలతో కలిసి అద్భుత పాలన అందించిన మహానేత వాజ్ పేయి. మహోన్నత పరిపాలనాదక్షుడు. వాజ్ పేయి ఉపన్యాసం కోసం ఇతర పార్టీల నేతలు కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఉదాహరణలున్నాయి. ఆయనో మంచి కవి. అలాంటి మహానేత మనకు స్పూర్తిధాత ఉండటం మన అదృష్టం. వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని ‘సుపరిపాలన దినోత్సవం’గా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సుపరిపాలన అందించిన ఘనత వాజ్ పేయి ప్రభుత్వానిదే. వాజ్ పేయి ఆశయ సాధన కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. వాజ్ పేయి ప్రారంభించిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నవ శకానికి నాంది పలుకుతోంది. ధనవంతులకే ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. పేదలకు కూడా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత వాజ్ పేయి ప్రభుత్వానికే దక్కుతుంది. సెల్ ఫోన్ విప్లవం మొదలైంది కూడా వాజ్ పేయి హయాంలోనే. వాజ్ పేయి అడుగు  జాడల్లో నడుస్తూ.. ఆయన సిద్దాంతాలను మనసా వాచా నమ్ముతూ పేదలకు సేవ చేయడమే వాజ్ పేయికి అందించే ఘన నివాళి’ అని కిషన్ రెడ్డి అన్నారు.

For More News..

కేటీఆర్ ఆయన తెలంగాణకు వస్తే తరిమి కొడతాం: రాజాసింగ్

మంచిర్యాలలో దారుణం.. మత్తెక్కలేదన్నా సర్జరీ చేసిన్రు

వేములవాడలో భక్తులపైకి దూసుకొచ్చిన కోడెలు