వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గందరగోళం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గందరగోళం

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గందరగోళం నెలకుంది. ఒక్కసారిగా కోడెలు  పరిగెత్తడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. రాజన్న ఆలయం నుంచి గోశాలకు ఒక్కసారిగా కోడేలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో భక్తులు కింద పడిపోయి.. తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్  అయ్యాయి. ఆలయంలో కోడెలను గంటల తరబడి తిప్పడంతో అవి నీరసించిపోయి దాడి చేశాయని భక్తులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయని తెలిపారు. ఆలయ అధికారులు కోడెల పట్ల  ప్రత్యేక జాగ్రత్తలు వహించి భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరుతున్నారు.

For More News..

ఇంటర్​తో డిఫెన్స్​లో ఎంట్రీ