కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి రైతు కూలీ మృతి

కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి రైతు కూలీ మృతి

మంగపేట, వెలుగు :  కొండరాళ్ల మధ్య ఇరుక్కుని ములుగు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఎస్సై గోదారి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం శనగకుంట గ్రామానికి చెందిన ఆకా శ్రీను(42) వ్యవసాయ కూలీ. ఆదివారం తన వదిన బిడ్డ పుట్టు వెంట్రుకలు తీయిస్తున్నారని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి గుట్టకు వెళ్లాడు. ఎద్దు ముక్కు ఒర్రె సమీపంలో ప్రమాదవశాత్తు శ్రీను కొండ రాళ్ల మధ్య పడిపోయాడు. అతను పడిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. సోమవారం శ్రీను మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదుతో కేసు ఫైల్​చేసినట్లు ఎస్సై రవి కుమార్ తెలిపారు.