చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారమియ్యాలె

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ. కోటి పరిహారమియ్యాలె
  • ఆప్​ నేత సోమ్​నాథ్ భారతి

న్యూఢిల్లీ, వెలుగు: తాము చేసిన పోరాటం వల్లే సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సౌతిండియా ఇన్​చార్జి సోమ్‌నాథ్ భారతి అన్నారు. తొలగించిన రెండేండ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలివ్వాలని, చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆప్ తెలంగాణ నేత ఇందిరా శోభన్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14 న తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ చేపట్టిన పథకాలను తెలంగాణలో ఇంటింటికీ తీసుకుపోతామన్నారు. పంచాయతీ సెక్రటరీలు, విద్యావలంటీర్లు, పేదలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తామని తెలిపారు.