- ఆప్ నేత సోమ్నాథ్ భారతి
న్యూఢిల్లీ, వెలుగు: తాము చేసిన పోరాటం వల్లే సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సౌతిండియా ఇన్చార్జి సోమ్నాథ్ భారతి అన్నారు. తొలగించిన రెండేండ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలివ్వాలని, చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆప్ తెలంగాణ నేత ఇందిరా శోభన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14 న తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ చేపట్టిన పథకాలను తెలంగాణలో ఇంటింటికీ తీసుకుపోతామన్నారు. పంచాయతీ సెక్రటరీలు, విద్యావలంటీర్లు, పేదలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తామని తెలిపారు.