తాగి భార్యపై దాడి చేసిన వినోద్ కాంబ్లీ

తాగి భార్యపై దాడి చేసిన వినోద్ కాంబ్లీ

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వార్తల్లోకెక్కాడు. మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో కాంబ్లీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 1.30గంటలకు  తాగి, తన ఫ్లాట్ కు వచ్చాడని అతని భార్య ఆండ్రియా పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత వేధింపులకు పాల్పడ్డాడని చెప్పారు.  ఆ సమయంలో అక్కడే ఉన్న తన 12ఏళ్ల కుమారుడు జోక్యం చేసుకున్నాడన్నారు. కానీ కాంబ్లీ మాత్రం కిచెన్ లోని  ఫ్యాన్ ను  తన తలపైకి విసిరేశాడని ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తన తలకు బలమైన గాయమైందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం భాభా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్టు ఆండ్రియా, పోలీసులకు తెలిపింది.

ఆండ్రియా  ఫిర్యాదు  మేరకు బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో కావాలనే గాయపరచడం), సెక్షన్ 504 (అవమానించడం) కింద కాంబ్లీపై కేసు నమోదు చేశారు.