దీపాలు వెలిగించి వెళ్లిపోయాడు .. రెండు షాపులు దగ్ధం

దీపాలు వెలిగించి వెళ్లిపోయాడు .. రెండు షాపులు దగ్ధం

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ బాలాజీహిల్స్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.   నవంబర్ 12వ తేదీన దీపావళి సందర్భంగా దీపం వెలిగించి షాప్ మూసి వెళ్లడంతో  పక్కపక్కనే ఉన్న రెండు షాపులు దగ్ధం అయిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..  దీపావళి పండుగ నేపథ్యంలో బుక్ షాప్ యజమాని  దీపాలు వెలిగించి షాపు మూసి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో  నిప్పురవ్వలు ఎగిసిపడి షాపులో ఉన్న  పుస్తకాలు దగ్ధం  అయిపోయాయి. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మారుతి టైలర్ షాపులోకి అగ్నికిలలు ఎగిసిపడటంతో  ఆ షాపు కూడా దగ్ధం అయిపోయింది. వీటివలన భారీగానే అస్థి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.