హైదరాబాద్లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు.. లక్షల్లో ఆస్తినష్టం

హైదరాబాద్లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు.. లక్షల్లో ఆస్తినష్టం

హైదరాబాద్లో శనివారం (ఫిబ్రవరి 17) సాయంత్రం పలు చోట్లు అగ్నిప్రమాదాలు జరిగాయి. కోఠిలోని గుజరాత్ గల్లీలోని సీసీ టీవీకెమెరా గోదాం లో మంటలు చెల రే గాయి. గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గుజరాత్ గల్లీ చాలా చిన్నది కావడంతో ఫైరింజన్  వచ్చే దారి కూడా లేదు. గోదాం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 50 లక్షల వరకు ఆస్టి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. 

మరోవైపు మణికొండలో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇస్తరాకుల కంపెనీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు గంట పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. నివాసాల మధ్య ఇస్తరాకుల కంపెనీ ఉండటంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ రెండు ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలిసి రాలేదు.