నాచారంలో మరో అగ్ని ప్రమాదం

నాచారంలో మరో  అగ్ని ప్రమాదం

హైదరాబాద్లో  నాచారం పీఎస్ పరిధిలో  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసారు. అగ్నిప్రమాదంతో విషవాయువులు వెలువడి పలువురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అస్వస్థతకు గురైన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.

అగ్ని ప్రమాదంతో అమోనియో విష వాయువు పీల్చుకుని పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ప్రాణాంతకమైన అమోనియోను కంపెనీలో ఎలా వాడుతారని ప్రశ్నించారు. పాశ్రామిక వాడ ఉన్నత అధికారులు స్పందించి ఏకశిలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాచారంలోనే వారంరోజులు తిరగకముందే మరో అగ్నిప్రమాదం జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.