
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ అంతట మంటలు వ్యాపించటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బిల్డింగ్ పక్కన ఉన్న అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. విలువైన ఫైల్స్ దగ్దమైనట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.