హైదరాబాద్ సిటీ రోడ్లపై మళ్లీ కార్లలో మంటలు.. ఎండలు పెరగటంతో ప్రమాదాలు

హైదరాబాద్ సిటీ రోడ్లపై మళ్లీ కార్లలో మంటలు.. ఎండలు పెరగటంతో ప్రమాదాలు

ఎండకాలం స్టార్టయ్యింది. వేసవి స్టార్టింగ్ లోనే  ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎండలు ఎక్కువ  ఉండటంతో  మళ్లీ రోడ్లపై కార్లలో మంటలు చెలరేగుతున్నాయి.  లేటెస్ట్ గా   హైదరాబాద్ లక్డీకపూల్ లో రోడ్డుపై  కారు తగలబడి పోయింది. 

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పోయించుకొనేందుకు వచ్చాడు ఓ వాహనదారుడు . పెట్రోల్ పోస్తుండగా కారులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో  పెట్రోల్ బంక్ నుండి కారును బయటకు తోసేశారు సిబ్బంది. 

ALSO READ :- KS Ravikumar:సెట్లో ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే  అప్రమత్తమైబయటకు వచ్చారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మంటల్లో పూర్తిగా దగ్దమైంది కారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది  మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమయ్యింది.