స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. బూడిదైన సామాగ్రి

స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. బూడిదైన సామాగ్రి

కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు అంటుకోవడంతో అందులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తైమైన స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో  అశోక్ లేలాండ్ వాహనంతో పాటు మారుతి కారు కూడా దగ్ధమైనట్లు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.