కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. UKలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు ప్రజలు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడమొక్కటే తగిన మార్గం అని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ పాజిటివ్ గా వచ్చిన వారు 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు.