
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు వైరస్ అధికంగా విస్తరించిన కేరళలో నిన్నటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. కానీ ఇవాళ(శనివారం) 69 ఏళ్ల ఒక వృద్దుడు కరోనాతో కొచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా. ఎన్.కే.కుట్టప్పన్ ప్రకటించారు.
దేశవ్యాప్త కరోనా వైరస్ మరణాల సంఖ్య 20కి చేరింది. భారత్లో ఇప్పటివరకు 908 వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా, కేరళలో ఆ సంఖ్య ఇప్పటి వరకు 178గా ఉంది.