మీ డాడీ ఏమైనా కింగా?.. మొదటి నామినేషన్స్తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్

మీ డాడీ ఏమైనా కింగా?.. మొదటి నామినేషన్స్తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7) మొదలై అప్పుడే ఒకరోజు కూడా గడిచిపోయింది. ఓపెనింగ్ డే చాల సరదాగా జరిగిన ఈ షోలో రెండో రోజే మంటపెట్టేశాడు బిగ్ బాస్. సీజన్ 7లో మొదటి నామినేషన్స్ కు రంగం సిద్ధం చేశాడు. కంటెస్టెంట్స్ కూడా ఒకరిగురించి ఒకరికి ఇంకా పూర్తిగా తెలుసుకోకుండానే నామినేషన్స్ కు రెడీ అయ్యారు. అయితే ఇది ప్రతీ సీజన్లో ఉండే తంతే. 

ఇక ఈ కొత్త సీజన్ లో కూడా మొదటి నామినేషన్స్ హీటెక్కించేశాయి. ఒకరిపై ఒకరు నామినేషన్ రీజన్స్ చెప్పుకుంటూ రెచ్చిపోయారు. నిజానికి ఒకరోజు మాత్రమే గడిచింది కాబట్టి పెద్దగా రీజన్స్ ఉండవు కానీ.. చెప్పుకోవాలి తప్పదు. అందుకే కంటెస్టెంట్స్ కూడా ఆలోచించి.. ఆలోచించి సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేసుకున్నారు. ఇక ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నట్టు సంచారం. అందులో గౌతమ్ కృష్ణ, రతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, దామిని భట్ల. 

ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగానే రీజన్స్ కరక్ట్ గా లేవంటూ వాదించుకున్నారు కంటెస్టెంట్స్. అందులో  శోభా శెట్టి, దామిని భట్ల అండ్ షకీలా, యావర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు మాటలు అనుకుంటూ రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా షకీలా, యావర్ మీ డాడీ కింగా.. మీ డాడీ కింగా అంటూ రెచ్చిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఇవాల్టీ ఎపిసోడ్ లో ఎంటెర్టైమెంట్ నెక్స్ట్ లెవల్లో ఉండనుంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. మొత్తానికి బిగ్ బాస్ అనుకున్నట్లుగా కంటెస్టెంట్స్ మధ్య పుల్లలైతే పెట్టేశాడు. ఇక ఈ మంట సీజన్ అయ్యేవరకు రగులుతూనే ఉంటుంది. దాని వల్ల ఆడియన్స్ కు ఫుల్ ఎంటెర్టైమెంట్ రావడం మాత్రం పక్క.