
ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రాకు చెందిన చందానిపాల్లో 32 కిలోల బరువున్న చేప... ఓ మత్స్యకారున్ని రాత్రికి రాత్రే ధనవంతున్ని చేసింది. తలచువాకు చెందిన ఓ మత్స్యకారుడు తన వలలో చిక్కిన ఈ 32 కిలోల చేపను పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక వ్యాపారికి రూ. 3.20 లక్షలకు విక్రయించాడు. తెలియా అని పిలవబడే ఈ చేప సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశ తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపించే ఒక రకమైన క్రోకర్ చేప. ఈ చేప ఔషధ విలువలకు ఇండోనేషియా, సింగపూర్ మరియు మలేషియాలో భారీ మార్కెట్ఉంది. అంతేకాకుండా సింగపూర్లో వైన్ శుద్ధి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు.