వారణాసిలో టిక్ టాక్ కోసం గంగలో దిగి మునిగిపోయారు

వారణాసిలో టిక్ టాక్ కోసం గంగలో దిగి మునిగిపోయారు

టిక్‌టాక్‌ వ్యసనం ఐదుగురు పిల్లల ప్రాణాలను తీసింది. టిక్‌టాక్ వీడియో కోసం గంగానదిలో దిగిన ఐదుగురు బాలురు చనిపోయారు.ఈ ఘటన వారణాసిలో జరిగింది. నీటిలోకి ముందుగా కొందరు విద్యార్థులు దిగగా… ఒడ్డున నిలబడి ఒకరు వీడియో తీశారు. అయితే నదిలోతు తెలియని ఓ బాలుడు ఒక్కసారిగా అందులో మునిగిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా నలుగురు కూడా  నదిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను  తౌసిఫ్, ఫదీన్, సైఫ్, రిజ్వాన్ ,సకీ అని పోలీసులు తెలిపారు. వారంతా 14 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారే.