ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. ఒకరు మృతి.. 70 మందికి అస్వస్థత

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం.. ఒకరు మృతి.. 70 మందికి అస్వస్థత

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయాడు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిగిలిన 68 మంది రోగులకు ఉస్మానియా నుంచి వచ్చిన ప్రత్యేక  వైద్య బృందం ద్వారా చికిత్స అందిస్తున్నారు. 

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆసుపత్రిని సందర్శించారు. బాధితులకు అందుతోన్న చికిత్స గురించి ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.