మాజీ గవర్నర్ తమిళిసై ఆస్తి ఎంతో తెలుసా?

మాజీ గవర్నర్ తమిళిసై ఆస్తి ఎంతో తెలుసా?

మొన్నటివరకు  తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళిసై సౌందర్ రాజన్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికీ రాజీనామా చేశారు. బీజేపీ అభ్యర్థిగా చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారామె. 

ఈ క్రమంలో సోమవారం తమిళిసై సౌందర్ రాజన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ ప్రకటించారు. తమిళిసై అఫిడవిట్ ప్రకారం.. మొత్తం రూ.2.17 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.50 వేల నగదుతోపాటు రూ.కోటి 57లక్షల 40 వేల286  చరాస్తులు ఉన్నాయి.

గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళి సై పనిచేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తూత్తుక్కుడి నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె కనిమొళి కరుణానిధిపై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు చేపట్టారు.