కేసీఆర్ ఓ నియంత… పతనం తప్పదు: మోత్కుపల్లి

కేసీఆర్ ఓ నియంత… పతనం తప్పదు: మోత్కుపల్లి

సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను మించిందని అన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి.  తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసే అర్హత కేసీఆర్ కు లేదని అన్నారు.  ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని… ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు.

ఆర్టీసీ సమ్మె పై గవర్నర్ స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు మోత్కపల్లి. సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కు పతనం తప్పదని ఆయన అన్నారు. కేసీఆర్ ఓ నియంత అని.. ఆయన్ను ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకథాటిపైకి రావాలని అన్నారు. ఆర్టీసీ వాళ్ల ఉసురు కేసీఆర్ కు తగులుతుందని చెప్పారు.