పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని డబుల్ చేస్తూ ఏపీ తీసుకున్న నిర్ణయం పై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే పోరాటాన్ని నడిపించాలని సూచించారు. ఏపీ కాంట్రాక్టర్ల కోసమేనా.. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్ టీఎంసీ పనులకు టెండర్లు పిలిచారని వివేక్ ఆరోపించారు. అటు కృష్ణా నీటిని దోచుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం లేదన్నా రు. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేసేలా వ్య వహరిస్తున్నారని, కమీషన్ల కోసమే జగన్తో దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఏ కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడా రో ఇప్పుడు కమీషన్లకోసం వారితోనే కుమ్మక్క య్యారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను ఎండబెట్టేలా జగన్ పోతిరెడ్డిపాడు కె పాసిటీని పెంచుతున్నారని, ఉద్యమ సమయంలో దీనిపై తీవ్ర స్వరంతో విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కిమ్మనడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సర్కారుకు తాకట్టు పెట్టేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో పనులు చేసేది మేఘా కృష్ణారెడ్డి అని, వాళ్లతో కేసీఆర్ లాలూచీ పడి పోతిరెడ్డిపాడుపై మాట్లాడటం లేదన్నా రు. అప్పుడు కర్నూలు జిల్లాలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వెళ్లి లొల్లిచేసిన హరీష్ రావు ఇప్పుడు అటువైపు ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు విస్తరణపై ఏపీ ప్రభుత్వ చర్యలను కేసీఆర్ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచితే అందరం కలిసి కొట్లాడి న విషయాన్ని వివేక్ గుర్తు చేశారు.
మన ప్రాజెక్టులు ఎండిపోతాయి
వైఎస్ హయాంలోనే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ను సీమకు తరలించే పోతిరెడ్డి పాడు కుట్ర మొదలైందని వివేక్అన్నారు. అప్పుడు రోజుకు 11 వేల క్యూ సెక్కుల కృష్ణా నీ టిని దోచుకుంటే.. ఇప్పుడు అంతకు ఏడింతలు 80 వేల క్యూసెక్కుల దోపిడీకి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే సీఎం పేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడుతో మన ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయని, రోజుకు 8 టీఎంసీలు లిఫ్టింగ్ చేస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని వివేక్ అన్నారు. పాలమూరు రంగా రెడ్డి, కల్వ కుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు రాకుండా పోతుందని, మహబూబ్ నగర్ లా బీడు వారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే మన నీళ్లుమనకొస్తాయని ప్రజలు కన్న కలలన్నీ అబద్ధాలని కేసీఆర్ రుజువు చేస్తున్నాడని వివేక్ మండిపడ్డారు.