కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసిన వివేక్

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసిన వివేక్

న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌‌ను మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కేంద్ర మంత్రిగా నియమితులైన సందర్భంగా భూపేంద్రను మర్యాద పూర్వకంగా కలసిన వివేక్.. ఆయనను శాలువాతో సన్మానించారు. తన తండ్రి జి. వెంకటస్వామి కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని భూపేంద్ర యాదవ్‌తో మాటల సందర్భంగా వివేక్ గుర్తు చేశారు. ఆయన హయాంలోనే పింఛన్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలిపారు.