- బీజేపీ అభ్యర్థి హనుమగౌడను గెలిపించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొప్పల్ జిల్లా కుష్టగి నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొడ్డన గౌడ హనుమగౌడ పాటిల్కు మద్దతుగా సాగేనాల గ్రామంలో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి వివేక్ వెంకటస్వామి బీజేపీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన వారిలో లాయర్లు కూడా ఉన్నారు. ఎన్నికల్లో హనుమగౌడ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్లను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. హనుమగౌడ పాటిల్ గెలుపు ఖాయమని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.