లాహోర్: అవినీతి ఆరోపణలతో ఏడేళ్ల శిక్ష పడ్డ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు పాకిస్తాన్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో బెయిల్ ఇచ్చారు. లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్కు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి సీరియస్ అవటంతో హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన సోదరుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని విచారించిన లాహోర్ హైకోర్టు జస్టిస్ బాక్వర్ నజాఫీ బెంచ్ బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజూరు కావడంతో ఆయన మద్దతుదారులు లాహోర్లోని హాస్పిటల్ దగ్గర పద్ద సంఖ్యలో చేరుకుని సంబురాలు జరుపుకున్నారు.

