దళితుడిని అభ్యర్థిగా ప్రకటించండి

దళితుడిని అభ్యర్థిగా ప్రకటించండి

జమ్మికుంట, వెలుగు: దళితబంధు కాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దళితుడిని ప్రకటించాలని వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్​జిల్లా జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్​లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలు చేయాలన్నారు.