
ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. బీజేపీతో వచ్చేది లేదు సచ్చేది లేదని విమర్శించారు. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా రాదన్నారు. ఎన్డీఏ కూటమి పత్తా లేకుండా పోతదని తెలిపారు.
ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీ అని చెప్పారు. ర్యాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోవడం లేదన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ ఈడీ, సీబీఐను నమ్ముకున్నారని విమర్శించారు. మోదీ వెనక అవినీతిపరులు ఉన్నారని ఆరోపించారు. అసదుద్దీన్ విజయం కోసం బీజేపీ పనిచేస్తుందని సీఎం రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజ్యాంగం ఉంటుందని పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.
కేసీఆర్ లెక్కఅడ్డగోలు ఖర్చులు చేయమని అవసరమైన వాటికూ ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికలు మా పార్టీకి రెఫరండమని అన్నారు. 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రడ్డి తెలిపారు.