జాబ్​ల పేరిట మోసం

జాబ్​ల పేరిట మోసం

చీట్​చేసిన తమిళనాడులోని కన్సల్టెన్సీ
ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు
బాధితుల సంఖ్య 200కుపైనే..
ఎంపీ అర్వింద్​ ధర్మపురిని కలిసిన నిరుద్యోగులు

నిజామాబాద్, వెలుగు : నిరుద్యోగ యువకులను విదేశాల్లో ఉద్యోగాల పేరిట తమిళనాడులోని ఓ ప్రైవేట్​ జాబ్​ కన్సల్టెన్సీ మోసం చేసింది. నిజామాబాద్​ పార్లమెంట్​సెగ్మెంట్​పరిధిలోని సుమారు 200 మంది యువకుల నుంచి రూ. 12 కోట్లు వసూలు చేసి విదేశాలకు పంపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్​, నిర్మల్, సిరిసిల్ల రాజన్న,  సిద్దిపేట జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. తమిళనాడులోని సేలం నగరానికి చెందిన యూరో నెక్సెస్ ​ఇమిగ్రేషన్​ కన్సల్టెన్సీ.. బ్రిటీష్​ ఓవర్సీస్ ​యూకేలోని కెమన్ ఐల్యాండ్​లో ఉన్న ప్రైవేట్​ హోటల్​లో క్లీనర్, వెయిటర్​ ఉద్యోగాలు పెట్టిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 6 లక్షలు తీసుకుంది. నెలకు సుమారు రూ. 40 వేల నుంచి 60 వేలు జీతం వస్తుందని నమ్మబలికారు. ఇలా సుమారు రూ.12 కోట్లు తీసుకున్నారు. జనవరి 24న వీసాలు కూడా పంపించారు. అయితే టికెట్​కన్ఫమ్ ​చేయకుండా వేధిస్తున్నారు. సాధారణంగా వీసా గడువు ఏడు నెలల్లోనే ముగుస్తుంది. ఈ లెక్కన జులై 24వ తేదీతో కాలపరిమితి ముగియబోతోంది. 
 

ఎంపీ అర్వింద్​ను కలిసిన బాధితులు
మోసపోయిన వారంతా ఆదివారం నిజామాబాద్​లో ఎంపీ అర్వింద్​ ధర్మపురిని కలిశారు. ఎంపీ ఆఫీసులో కలిసి గోడు వెల్లబోసుకున్నారు. నెలకు రూ.40 వేలు వస్తుందని చెబితే నమ్మి, ఒక్కొక్కరం రూ.6 లక్షలు ఇచ్చామని, ఎప్పుడు ఫోన్​చేసినా పనై పోతుందని తప్పించుకుంటున్నారన్నారు.    
 

ఎన్ఆర్ఐ సెల్​ఎక్కడుంది? 
 ఎంపీ అర్వింద్ ​మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సెల్ ఎక్కడుందో సీఎం కేసీఆర్,  మాజీ ఎంపీ కవిత జవాబు చెప్పాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ. 500 కోట్లు కేటాయించి ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. వర్క్ వీసా ఏడు నెలల తర్వాత ఎక్స్​పైరీ అవుతుందని, మోసపోయిన నిరుద్యోగులకు తండ్రీకూతుళ్లు సమాధానం