- ఇన్స్టాలో పోస్ట్ చేసిన బాధితురాలు
- ఫైర్ అవుతున్న నెటిజన్లు
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని ప్రముఖ ‘లులు మాల్’లో కొనుగోలు చేసిన మిక్చర్ ప్యాకెట్లో ఫ్రై అయిన బల్లి ప్రత్యక్షమవ్వడం కలకలం సృష్టించింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని బాధిత మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. బాధితురాలి వివరాల ప్రకారం.. గత సోమవారం ఓ కుటుంబం లులు మాల్లోని హైపర్మార్కెట్కు వెళ్లి కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ ప్యాకెట్ కొనుగోలు చేసింది.
ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు ఆ మిక్చర్ను కొంత తిన్నారు. శనివారం ఉదయం సదరు మహిళ మిక్చర్ ప్యాకెట్ తెరవగా, అందులో ఫ్రై అయి ఉన్న బల్లిని చూసి షాకైంది. ఈ అంశాన్ని వెంటనే ఇన్స్టాలో వీడియో తీసి పోస్టు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పెద్ద మాల్లోనే ఇలాంటి ఘోరం జరగడం దారుణమని, మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
