గత ప్రభుత్వాల నిధులు దళారులకే దక్కేవి: మోడీ

గత ప్రభుత్వాల నిధులు దళారులకే దక్కేవి: మోడీ

కర్ణాటక : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తాము ఇస్తున్న నిధులు పూర్తిస్థాయిలో వినియోగమవుతున్నాయన్నారు.

గత ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తే.. అందులో 80 శాతానికి పైగా దళారుల జేబుల్లోకి వెళ్లేవని.. తాము వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామన్నారు. కర్ణాటక టూర్ లో ఉన్న ఆయన.. తుముకూరులో జరిగిన కృషి కర్మన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.