తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాడుదాం

తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాడుదాం

తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శనివారం రాజ్ఘాట్ లో మౌన దీక్ష చేస్తాననని ఆయన ప్రకటించారు. తెలంగాణకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తేల్చి చెప్పారు. ‘‘కేసీఆర్, జగన్ సహా తెలుగు రాష్ట్రాల నేతలను ఆహ్వానిస్తున్నా. తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాటం చేద్దాం. తెలుగు రాష్టాల సత్తా మోడీకి చూపిద్దాం’’ అని పాల్ అన్నారు. జగన్ సీబీఐ కేసులకు భయపడి కేంద్రానికి మద్ధతు తెలుపుతున్నారని..కేసీఆర్ బీజేపీకి బీ టీం అని ఆరోపించారు. బండి సంజయ్ ప్రధాని మోడీని దేవుడు అంటుండని..అసలు దేవుడు ఎలా ఉంటాడో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. జగన్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని..రాష్ట్రానికి కంపెనీలు కూడా తీసుకురాలేదని విమర్శించారు.