ట్రాన్స్ జెండర్... ప్రస్తుతం వీళ్లు కూడా అన్నిచోట్ల రాణిస్తున్నారు.తమకు భగవంతుడు ఇచ్చిన లోపానికి సిగ్గు పడకుండా.. సమాజంలో తల ఎత్తుకొని నిలబడుతున్నారు. చాలామంది ధైర్యంతో ముందుకు వెళ్తూ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. తాజాగా తమిళనాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధిఇంచారు. గంగా నాయక్ .. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్జెండర్గా రికార్డుల్లోకెక్కింది.
వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రంలో వేల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 37వ వార్డు విజేతగా నాయక్ ను డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. గంగా నాయక్ దినసరి కూలి. 20ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. తాజాగా గెలిచిన గంగా నాయక్ తన కమ్యూనిటీకి అందిస్తున్న సేవలు మరింత విస్తరిస్తానని చెబుతుంది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 15ఓట్ల వ్యత్యాసంతోనే ఆమె గెలుపొందడం విశేషం. ప్రస్తుతం గంగా నాయక్ దక్షిణ ఇండియా ట్రాన్స్జెండర్ అసోసియేషన్ కు సెక్రటరీగా సేవలు అందిస్తోంది.
ఇవి కూడా చదవండిః
నల్గొండలో సమంత సందడి
ఒక్క విమానం పెండింగ్.. పూర్తయిన రాఫెల్ ఒప్పందం