హీరోయిన్ సమంత నల్గొండ పట్టణంలో సందడి చేసింది. బుధవారం నల్గొండ పట్టణానికి వచ్చిన సమంత.. మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించింది. సమంత వస్తుందన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మాంగళ్య షాపింగ్ మాల్కు ముందే చేరుకున్నారు. రెడ్ కలర్ పట్టు చీరలో మెరిసింది హీరోయిన్ సమంత. ఆమె మాల్కు చేరుకోగానే ఫ్యాన్స్ కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ ను ఆత్మీయంగా పలకరించింది సమంత. సెల్ఫీలు కూడా ఇచ్చింది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన నటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
కాగా.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది సమంత. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఫ్రెండ్స్ తో విహార యాత్రలు కూడా చుట్టేస్తోంది.
మరిన్ని వార్తల కోసం..