రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి బృందావన్ కాలనీలో గాంజా గ్యాంగ్ రెచ్చిపోయింది. నలుగురు వ్యక్తులు రావుల భాస్కర్, రావుల విక్రాంత్, రాజు, విశాల్ పై గాంజా గ్యాంగ్ దాడికి పాల్పడింది. చిన్నపిల్లల గొడవను ఆపడానికి వెళ్ళిన రావుల భాస్కర్ ను కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యింది గాంజా గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మైనర్ రావుల విక్రాంత్ మెడపై కత్తితో దాడి చేశారు. యువకుడు ప్రతిఘటించి తప్పించుకున్నాడు. కాలనీ వాసులు గాంజా గ్యాంగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐదు మందిని అదుపులో తీసుకొని విచారిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.